Monday, February 13, 2023

History of Anti Smuggling Day in Telugu | దొంగ రవాణా వ్యతిరేక దినోత్సవం - ఫిబ్రవరి 11

History of Anti Smuggling Day in Telugu | దొంగ రవాణా వ్యతిరేక దినోత్సవం - ఫిబ్రవరి 11 | Student Soula Tags: Anti Smuggling Day in telugu, Anti Smuggling Day essay in telugu, History of Anti Smuggling Day in telugu, about Anti Smuggling Day in telugu, theme of Anti Smuggling Day 2023 in telugu, donga ravaana dinotsavam, Day Celebrations, Days Special, What today special, today special, today history, Days, Important days, important days in telugu, important days in January, important days in February, important days in  March, important days in  April, important days in May, important days in  June, important days in  July, important days in August, important days in September, important days in October, important days in November, important days in December, special in February, days celebrations in February, popular days in February, February lo dinostavalu, special in February 11, Student Soula,

ANTI SMUGGLING DAY
దొంగ రవాణా వ్యతిరేక దినోత్సవం
****

ఉద్దేశ్యం:

  • దేశార్థికానికి తీవ్ర హాని చేస్తున్న దొంగ రవాణా (Smuggling) పై అవగాహన కల్పించేందుకు ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి 11వ తేదీన దొంగ రవాణా వ్యతిరేక దినోత్సవం (Anti Smuggling Day) జరుపుకుంటారు.

ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారు?

  • 2022 నుండి ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి 11 న దొంగ రవాణా వ్యతిరేక దినోత్సవం (Anti Smuggling Day) జరుపుకుంటున్నారు.
  • భారత పరిశ్రమల సమాఖ్య (FICCI) ఆధ్వర్యంలోని దొంగ రవాణా నకిలీల వ్యతిరేక కమిటీ (CASCADE) ఈ దినోత్సవానికి నాయకత్వం వహిస్తుంది.

దొంగ రవాణా (Smuggling):

  • చట్టాన్ని ఉల్లంఘిస్తూ, ముఖ్యంగా చట్టపరమైన సుంకం (TAX) చెల్లించకుండా వస్తువులను రహస్యంగా దిగుమతి లేదా ఎగుమతి చేయడాన్ని దొంగ రవాణా (Smuggling) అంటారు.
  • వ్యభిచారం, బలవంతపు శ్రమ లేదా ఇతర రకాల దోపిడి కోసం మానవులను తరలించడం, సేకరించడం, వాళ్ళతో వ్యాపారం చేయించడం, వాళ్ళని కొనడం మరియు అమ్మడాన్ని మానవ అక్రమ రవాణా (Human Trafficking) అంటారు.

దొంగ రవాణాకు కారణాలు:

  • పలుదేశాల్లో కొన్ని రకాల వస్తువులపై అధిక పన్నురేట్లు, నిషేధం ఉండటం, చవగ్గా ప్రత్యామ్నాయాలు దొరకడం వంటివి దొంగ రవాణాకు దారితీస్తున్నాయి.
  • సాధారణంగా బంగారం, పొగాగు, మద్య ఉత్పత్తులు, ఎలెక్ట్రానిక్ వస్తువులు, మొబైల్ ఫోన్లు, మత్తు పదార్థాలు, పురాతన విగ్రహాలు, ఎర్ర చందనం, జంతువుల శరీర భాగాలు ఇలా లెక్కకు మిక్కిలిగా దొంగ రవాణాకు గురైతున్నాయి.
  • కొన్ని జంతువుల శరీర భాగాల్లో ఔషధ గుణాలు ఉంటాయనే దురాశ, మూఢనమ్మకాలు, ఇతర దేశాల ప్రాణులను పెంచుకోవాలనే కోరిక, గృహాలంకరణ అభిలాష వంటివి దొంగ రవాణా వర్ధిల్లేలా చేస్తున్నాయి.
  • నిఘా వ్యవస్థ వైఫల్యం, అధికారుల అవినీతి స్మగ్లింగ్ నిరాటంకంగా కొనసాగడానికి సహకరిస్తున్నాయి.

దొంగ రవాణావల్ల నష్టాలు:

  • దొంగ రవాణా ప్రభుత్వాల పన్ను ఆదాయానికి నష్టాన్ని కలిస్తుంది.
  • దేశార్థికాన్ని కుంగదీస్తుంది. 
  • చట్టబద్ధంగా నడుస్తున్న సంస్థలను అస్థిరపరుస్తుంది.
  • ఆవిష్కరణలు, పెట్టుబడులకు విఘాతంగా మారుతుంది. 
  • వినియోగదారుల భద్రత ప్రమాదంలో పడుతుంది.
  • జీవ వైవిధ్యానికి నష్టం వాటిల్లుతుంది.
  • స్మగ్లింగ్ ప్రపంచవ్యాప్తంగా నేర కార్యాకలాపాలు, అవినీతి, ఉగ్రవాదాన్ని సైతం పెంచి పోషిస్తుంది.
  • ఉద్యోగావకాశాలు చాలామంది కోల్పోతారు.

స్మగ్లింగ్ ను నివారించడం కష్టసాధ్యం:

  • దొంగ రవాణా విషయంలో పైస్థాయి వ్యక్తులు అత్యంత గోప్యత పాటిస్తారు. తమతో నేరుగా సంబంధం లేని వ్యక్తులనే క్షేత్రస్థాయిలో స్మగ్లింగ్ కు వినియోగిస్తారు. వారే అధికంగా పోలీసులకు పట్టుబడుతున్నారు. దానివల్ల దొంగ రవాణా అసలు మూలాలు తెలియడం లేదు. 
  • ఒక వేళ బడా వ్యక్తులను అరెస్టు చేసిన రాజకీయ బలం, చట్టంలోని లొసగులను ఉపయోగించుకుని బయటకు వచ్చేస్తున్నారు.
  • అధికార గణంలో పేరుకుపోయిన అవినీతి, భధ్యతారాహిత్యం సైతం అక్రమార్కులకు వరాలుగా మారుతున్నాయి.
  • వీటన్నిటికి సరైన విరుగుడు చర్యలు చేపట్టకుండా భారత్ లో స్మగ్లింగ్ ను నివారించడం కష్టసాద్యం.

గణాంకాలు:

DRI Report 2021-22:

  • అక్రమ మార్గాల్లో భారత్ లోకి తరలించిన 833 KG ల బంగారాన్ని Directorate of Revenue Intelligence (DRI) పట్టుకుంది. దాని విలువ సుమారు రూ.405.35 కోట్లు. పట్టబడ్డ మొత్తం బంగారంలో  37% మయన్మార్ నుంచే వచ్చింది. 
  • 2021 నవంబర్ ఒక్క నెలలోనే అత్యధికంగా 144 KG ల బంగారం పట్టుబడింది. 
  • రూ.93 కోట్ల విలువైన సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులను DRI స్వాధీనం చేసుకుంది.
  • 28334 KG ల మత్తు పదార్థాలు పట్టుబడ్డాయి.
  • DRI Reports (Official Website)

FICCI CASCADE Report 2019-20:

  • మొబైల్ ఫోన్లు, FMCG-గృహ & వ్యక్తిగత వస్తువులు, FMCG-ప్యాకేజ్డ్ ఆహారాలు, పొగాకు ఉత్పత్తులు, మద్య పానీయాలు, ఈ ఐదు విభాగాల్లో భారత్ రూ.58,521 కోట్ల పన్ను ఆదాయాన్ని నష్టపోయింది. ఈ ఐదు విభాగాల్లో అక్రమ విపణి విలువ రూ.2,60,094 కోట్లు. ఈ ఐదు విభాగాల్లో 15.96 లక్షల ఉద్యోగావకాశాలు దూరమయ్యాయి. 
  • FICCI CASCADE Reports (Official Website)

వీటిని కూడా చూడండీ :-


No comments:

Post a Comment