Saturday, January 28, 2023

History of Election Commission of India in Telugu | భారత/ కేంద్ర ఎన్నికల సంఘం

 

History of Election Commission of India in Telugu | భారత/ కేంద్ర ఎన్నికల సంఘం  History of Election Commission of India in telugu, Election Commission of India in telugu, about Election Commission of India in telugu, Election Commission of India, National Voters Day in telugu, National Voters Day in telugu, History of National Voters Day in telugu, about National Voters Day, Themes of National Voters Day, Celebrations of National Voters Day, National Voters Day essay in telugu, National Voters Day, jathiya voters dinotsavam, why we celebrate National Voters Day in telugu, Student Soula,
History of Election Commission of India in Telugu |
భారత/ కేంద్ర ఎన్నికల సంఘం

Election Commission of India
భారత/ కేంద్ర ఎన్నికల సంఘం

****

  • ఇది శాశ్వత, స్వతంత్ర ప్రతిపత్తిగల రాజ్యాంగ సంస్థ.
  • ఇది 25 జనవరి 1950 న ఏర్పడింది.
  • దీని ప్రధాన కార్యాలయం పేరు - నిర్వచన్ సదన్ (న్యూఢిల్లీ)
  • భారత రాజ్యాంగంలో 15 భాగంలోని ఆర్టికల్ 324 నుండి 329 వరకు కేంద్ర ఎన్నికల సంఘం నిర్మాణం, అధికారాలు, విధుల గురించి తెలుపుతున్నాయి.
  • 324(1) - కేంద్ర ఎన్నికల కమీషన్ రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, పార్లమెంట్, రాష్ట్ర శాసనసభ ఎన్నికలను నిర్వహిస్తుంది.
  • 324(2) -  ఇందులో ఒక ప్రధాన ఎన్నికల కమీషనర్ మరియు రాష్ట్రపతి నిర్ణయించిన సంఖ్యలో ఇతర కమీషనర్లు ఉంటారు. ఈ అంశాన్ని పార్లమెంట్ చట్టం ద్వారా నియంత్రించవచ్చు.
  • 324(3) - ఎన్నికల సంఘంలో ఇతర కమీషనర్లు నియమించబడితే, ప్రధాన ఎన్నికల కమీషనర్ ఛైర్మన్ గా వ్యవహరిస్తాడు.
  • 324(4) - కేంద్ర ఎన్నికల సంఘాన్ని సంప్రదించి ప్రాంతీయ ఎన్నికల కమీషనర్లను రాష్ట్రపతి నియమించవచ్చు.
  • 324(5) - పార్లమెంటు చేసిన చట్టాలకు అనుగుణంగా కేంద్ర ఎన్నికల కమీషనర్, ప్రాంతీయ కమీషనర్లకు సంబంధించి పదవీకాలం, ఇతర సర్వీసు నిబంధనలను రాష్ట్రపతి నిర్ణయిస్తారు: సుప్రీంకోర్టు న్యాయామూర్తులను తొలగించే విధంగానే ప్రధాన ఎన్నికల కమీషనర్ ను పార్లమెంటు తొలగిస్తుంది. కానీ ఇతర కమీషనర్లను మాత్రం ప్రధాన ఎన్నికల కమీషనర్ సలహా మేరకు అవినీతి, అసమర్థత అనే కారణాలపై రాష్ట్రపతి తొలగిస్తాడు.
  • 324(6) - కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రపతి, గవర్నర్ల అనుమతితో ఎన్నికల నిర్వహణ కొరకు కేంద్ర, రాష్ట్ర పభుత్వ సిబ్బందిని తీసుకుంటుంది. 
  • 325 - మతం, కులం, జాతి, లింగ ప్రాతిపదికలపై ఏ పౌరునికి ఓటు హక్కు నిరాకరించరాదు.
  • 326 - 18 సంవత్సరాలు నిండిన భారత పౌరులకు వయోజన ఓటు హక్కు కల్పించడమైంది.
  • 327 - ఎన్నికలకు సంబంధించి చట్టాలను పార్లమెంట్ రూపొందిస్తుంది.
  • 328 - రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు సంబంధించిన చట్టాలను పార్లమెంటు రూపొందించకుంటే రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించుకోవచ్చు
  • 329 - ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత న్యాయాస్థానాలు సాధారణంగా ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోరాదు.

ముఖ్యమైన అంశాలు:

  • ప్రధాన, ఇతర ఎన్నికల కమీషనర్ల పదవి కాలం - 6 సంవత్సరాలు లేదా పదవి విరమణ వయస్సు 65.
  • ప్రధాన ఎన్నికల కమీషనర్ కు, ఇతర ఎన్నికల కమీషనర్లకు అధికారాలలో, హోదాలలో, జీత భత్యాలలో వ్యత్యాసం లేదు. నిర్ణయాలను సాధారణంగా ఏకగ్రీవంగా తీసుకుంటారు. సాధ్యం కాకపోతే మెజారిటీ ప్రాతిపదికపై తీసుకుంటారు.
  • వీరి జీతభత్యాలను పార్లమెంటు నిర్ణయిస్తుంది. కేంద్ర సంఘటిత నిధి నుండి చెల్లిస్తారు. వీరి జీతభత్యాలు సుప్రీంకోర్టు న్యాయమూర్తి వేతనంతో సమానంగా ఉంటాయి. ప్రస్తుతం వీరి వేతనం నెలకు రూ.2,50,000/-
  • భారత ప్రధాన, ఇతర ఎన్నికల కమీషనర్లను రాష్ట్రపతి నియమిస్తాడు.
  • రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఓటింగ్ వయస్సు 21 సంవత్సరాలు ఉండేది. అయితే 1988 లో 61వ రాజ్యాంగ సవరణ ద్వారా దానిని 18 సంవత్సరాలకు రాజీవ్ గాంధి ప్రభుత్వం తగ్గించింది. ఈ సవరణ మార్చి 28, 1989 నుంచి అమలులోకి వచ్చింది.
  • ఎన్నికలు జరిగే సమయంలో అనగా ఫలితాలు ప్రకటించక ముందు ఎన్నికల్లో జరిగిన అక్రమాలు, ఫిర్యాదులకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘమే పరిశీలించి తీర్పును వెలువరిస్తుంది. ఈ దశలో న్యాయాస్థానాన్ని ఆశ్రయించడానికి వీలు లేదు.
  • అయితే ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఎలాంటి వివాదాన్నయిన హైకోర్టులోనే పరిష్కరించుకోవాలి.
  • మొదటి ప్రధాన ఎన్నికల కమీషనర్ - సుకుమార్ సేన్
  • ప్రధాన ఎన్నికల కమీషనర్ గా పనిచేసిన తొలి తెలుగువారు - ఆర్.వి.ఎస్.పేరిశాస్త్రీ
  • ప్రధాన ఎన్నికల కమీషనర్ గా పనిచేసిన మొదటి మహిళ - వి.ఎస్.రమాదేవి (తెలుగు మహిళ)
  • ప్రస్తుత ప్రధాన ఎన్నికల కమీషనర్ (25వ) - రాజీవ్ కుమార్ (15 మే 2022 నుండి)

ప్రజా ప్రాతినిధ్య చట్టాలు (Representation of Peoples Acts):

  • భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 81 మరియు 170 లో పార్లమెంట్ మరియు రాష్ట్ర శాసనసభలలో ఉండాల్సిన గరిష్ఠ సభ్యుల సంఖ్యను, సీట్ల కేటాయింపునకు సంబంధిచిన కొన్ని నియమాలను మాత్రమే పేర్కొన్నారు.
  • సీట్ల కేటాయింపు, నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ, రిజర్వేషన్లు, మొదలైన విషయాలను పార్లమెంట్ ఒక చట్టం ద్వారా నిర్ణయిస్తుంది.
  • ఇప్పటివరకు దీనికి సంబంధించి పార్లమెంటు రెండు చట్టాలను చేసింది.
(1) ప్రజా ప్రాతినిధ్య చట్టం-1950:
  • ఇందులో ఓటర్లు, అర్హతలు, ఓటర్ల పునర్ వ్యవస్థీకరణ, పార్లమెంటు మరియు రాష్ట్ర శాసనసభలకు సీట్ల కేటాయింపునకు సంబంధించిన అంశాలు ఉంటాయి.
(2) ప్రజా ప్రాతినిధ్య చట్టం-1951:
  • ఇందులో ఎన్నికల నిర్వహణ, ఎన్నికల సిబ్బంది, పర్యవేక్షణ, ఎన్నికల వివాదాలు, ఉప ఎన్నికలు, రాజకీయ పార్టీల గుర్తింపు మొదలగు అంశాలు ఉంటాయి.

ఇతర అంశాలు:

  • ఎన్నికలకు సంబంధించి చేసే చట్ట వ్యతిరేఖ అవినీతి కార్యకలాపాల ఉల్లంఘనలపై నిర్దేశించిన చట్టాల వివరాలు (Click Here)


No comments:

Post a Comment