Banner 160x300

History of Minorities Rights Day in Telugu | మైనారిటీ హక్కుల దినోత్సవం


History of Minorities Rights Day in Telugu | మైనారిటీ హక్కుల దినోత్సవం - డిసెంబర్ 18
Minorities Rights Day in telugu, Minorities Rights day essay in telugu, History of Minorities Rights Day, about Minorities Rights Day, Themes of Minorities Rights Day, Celebrations of Minorities Rights Day, Minorities Rights Day, Minorities hakkula dinotsavam, Day Celebrations, Days Special, What today special, today special, today history, Days, Important days, important days in telugu, important days in January, important days in February, important days in  March, important days in  April, important days in May, important days in  June, important days in  July, important days in August, important days in September, important days in October, important days in November, important days in December, special in December, days celebrations in December, popular days in December, December lo dinostavalu, special in December 18, Student Soula,

మైనారిటీ హక్కుల దినోత్సవం - డిసెంబర్ 18


ఉద్దేశ్యం:
  • అల్ప సంఖ్యాకులకు (Minorities) తమ హక్కుల పట్ల అవగాహన కల్పించడం మైనారిటీ హక్కుల దినోత్సవం (Minorities Rights Day) యొక్క ముఖ్య ఉద్దేశ్యం.
  • ఈ రోజు భారతదేశంలోని ప్రతి రాష్ట్రం మైనారిటీలకు సంబంధించిన సమస్యలతో పాటు రాష్ట్రంలో వారి భద్రతపై దృష్టి పెడుతుంది. మైనారిటీల హక్కుల దినోత్సవం సందర్భంగా వివిధ సెమినార్లు, ప్రచారాలు మరియు కార్యక్రమాలు నిర్వహిస్తారు. 

ఎప్పటి నుంచి?
  • 1993 నుంచి ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 18వ తేదీని మైనారిటీ హక్కుల దినోత్సవంగా జరుపుకుంటున్నారు.
  • భారతదేశంలో ప్రతి సంవత్సరం డిసెంబర్ 18న జాతీయ మైనారిటీల కమిషన్ (NCM- National Commission for Minorities) ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తుంది.

డిసెంబర్ 18నే ఎందుకు?
  • మతం, భాష, జాతీయత లేదా జాతి ప్రాతిపదికన ప్రపంచవ్యాప్తంగా ప్రజలలో వివక్ష చూపడాన్ని వ్యతిరేకిస్తూ ఐక్యరాజ్యసమితి 1992 డిసెంబర్ 18 న మైనారిటీలకు చెందిన వ్యక్తుల హక్కుల ప్రకటనను ప్రకటించింది.

భారతదేశంలో మైనారిటీలు:
  • భారత రాజ్యాంగం అల్ప సంఖ్యాక వర్గం (Minority) అనే పదాన్ని నిర్దిష్టంగా నిర్వచించనప్పటికీ మతపరమైన, భాషాపరమైన అల్పసంఖ్యాక వర్గాల గురించి ప్రస్తావించింది.
  • భారత ప్రభుత్వం అల్ప సంఖ్యాక వర్గాల కోసం జాతీయ మైనారిటీ కమిషన్‌ చట్టం - 1992 ను రూపొందించింది. ఈ చట్టంలోని సెక్షన్‌ 2(C) కింద భారతదేశంలో 06 మతాలను మైనారిటీలుగా గుర్తించారు. అవి:-
(1) ముస్లింలు (Muslims) 
(2) సిక్కులు (Sikhs) 
(3) క్రైస్తవులు (Christians) 
(4) బౌద్ధులు (Buddhists) 
(5) జొరాస్ట్రియన్లు (పార్సీలు) Zoroastrians (Parsis) 
(6) జైనులు (Jains) (2014 జనవరి 17న కేంద్ర ప్రభుత్వం జైనులను మైనారిటీలుగా గుర్తించింది)
  • భారతదేశంలో మైనారిటీలు 2011 జనగణన ప్రకారం మొత్తం జనాభాలో 19% ఉన్నారు.
  • జమ్ము కాశ్మీర్, పంజాబ్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్ మరియు లక్షద్వీప్ లు మాత్రమే నోటిఫైడ్ మైనారిటీ మెజారిటీ ఉన్న రాష్ట్రాలు. 

మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Ministry of Minority Affairs):
  • 2006 జనవరి 29 న కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ నుంచి మైనారిటీలను వేరుచేసి వారికి ప్రభుత్వ విధానాలు మరింత చేరువయ్యేలా ప్రత్యేకంగా మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారు.
  • ఇది మైనారిటీ వర్గాల కోసం వివిధ సంక్షేమ, నియంత్రణ మరియు అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తుంది.
  • మొదటి కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి - A.R. Antulay (2006 - 2009).

జాతీయ మైనారిటీల కమిషన్ (NCM- National Commission for Minorities):
  • 1978లో పార్లమెంట్ ఒక ఆదేశం ద్వారా జాతీయ మైనారిటీల కమిషన్ ను ఏర్పాటు చేసింది.
  • 1985 లో దీనిని హోం మంత్రిత్వ శాఖ నుంచి సంక్షేమ శాఖకు బదిలీ చేశారు.
  • జాతీయ మైనారిటీల కమిషన్ చట్టం - 1992 ఆధారంగా 1993లో జాతీయ మైనార్టీ కమిషన్‌కు చట్టబద్ధత కల్పించారు. ఇది 1993 మే 17 నుంచి అమల్లోకి వచ్చింది.
  • ఈ కమిషన్ కు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించడం కోసం 2005లో 103వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రతిపాదించారు. అయితే ఈ బిల్లు మురిగిపోయింది.
  • ఇది ప్రస్తుతం మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో అంతర్భాగం.
  • దీనిలో ఒక Chairman, ఒక Deputy Chairman, 06 గురు Members ఉంటారు. వీరిని నియమించే అధికారం, తొలగించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. పదవీ కాలం 3 సంవత్సరాలు.

రాష్ట్ర మైనార్టీ కమిషన్:
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీ కమిషన్ చైర్మన్, సభ్యుల పదవీకాలం 3 సంవత్సరాలు. వీరిని గవర్నరు నియ మిస్తాడు. గవర్నరు తొలగిస్తాడు.
  • వీరు తమ రాజీనామా పత్రాన్ని గవర్నరుకు సమర్పి స్తారు.
  • రాష్ట్రంలోని మైనార్టీ జీవన స్థితిగతుల పైన విచారణ జరిపి నివేదికలు ఇవ్వటం దీని ప్రధాన విధి.
  • ఈ కమిషన్ తన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించును.
ప్రధాన విధులు:
  • మైనార్టీల స్థితిగతులను అధ్యయనం చేసి నివేదికను సమర్పించడం. ఆ నివేదికలో పేర్కొన్న సమస్యల పరిష్కారానికి సలహాలు ఇవ్వడం.
  • మైనార్టీ ఫిర్యాదులను స్వీకరించి, విచారించి అవసరమైన చర్యలకు సిఫారసు చేయడం.
  • మైనార్టీలకు రాజ్యాంగం ద్వారా కల్పించబడిన ప్రత్యేక సదుపాయాల పట్ల అవగాహన కల్పించి చైతన్య పరచడం.
  • మైనార్టీ సంక్షేమానికి వివిధ ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను సమీక్షించడం మొదలైనవి. 

మైనారిటీలకు రాజ్యాంగ రక్షణలు:
  • భారతీయ రాజ్యాంగం మైనారిటీ అనే పదాన్ని నిర్వచించనప్పటికీ, అది రాజ్యాంగ భద్రతలను మరియు మైనారిటీలకు ప్రాథమిక హక్కులను అందించింది.
  • ఆర్టికల్‌ 29(1): భారత దేశంలో నివసిస్తున్న పౌరుల్లో ఏ వర్గం వారైనా తమ విశిష్ట భాష, సంస్కృతి, లిపిని కాపాడుకునే హక్కు కలిగి ఉంటారు.
  • ఆర్టికల్‌ 29(2): రాజ్యం నిర్వహిస్తున్న లేదా రాజ్య ఆర్థిక సహాయం పొందుతున్న విద్యా సంస్థల్లో ప్రవేశాలను మత, జాతి, కుల, భాష ప్రాతిపదికన ఏ పౌరుడికి నిరాకరించకూడదు.
  • ఆర్టికల్‌ 30(2):  అల్ప సంఖ్యాక వర్గాల నిర్వహణలోని విద్యా సంస్థలకు ఆర్థిక సహాయం మంజూరు చేసే విషయంలో రాజ్యం ఎలాంటి వివక్ష చూపకూడదు.
  • ఆర్టికల్‌ 347: ఏదైనా ఒక రాష్ట్రంలో మెజారిటీ సంఖ్యలో ఉన్న జనాభా తాము మాట్లాడే భాషను ఆ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాల్సిందిగా రాష్ట్రపతిని కోరవచ్చు. రాష్ట్రపతి ఈ సమయంలో తగు చర్యలు తీసుకోవచ్చు. 
  • ఆర్టికల్‌ 350: ఏ వ్యక్తి అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపయోగించే ఏ భాషలోనైనా తన సమస్యను సంబంధిత అధికారికి విన్నవించుకోవచ్చు.
  • ఆర్టికల్‌ 350(A): భాషాపరమైన అల్పసంఖ్యాక వర్గాల వారికి ప్రాథమిక స్థాయిలో వారి మాతృభాషలోనే విద్యా బోధన చేసేందుకు సదుపాయాలు కల్పించాలి.
  • ఆర్టికల్‌ 350(B): భాషాపరమైన మైనారిటీల కోసం రాష్ట్రపతి ప్రత్యేకాధికారిని నియమించాలి.

మైనారిటీల స్థితిగతులపై కమిటీలు:
(1) సచార్‌ కమిటీ:

  • భారతదేశంలో సామాజిక, ఆర్థిక, విద్యా రంగాల్లో ముస్లింల స్థితికి సంబంధించి నివేదికను సమర్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం జస్టిస్‌ రాజేందర్‌ సచార్‌ (Rajinder Sachar) నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో 2005 మార్చి 9న ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ 2006 నవంబరు 17న ప్రభుత్వానికి తన నివేదికను సమర్పించింది.
సిఫారసు:
  • సామాజిక , మతపరమైన వర్గాల ప్రాథమిక సమాచారాన్ని సేకరించాలి.
  • స్థానిక ప్రభుత్వాలలో నియామకం ద్వారా ప్రాతినిధ్యం కల్పించడం.
  • బ్రిటన్లో మాదిరిగా సమాన అవకాశాల కమిషన్ ఏర్పాటు చేయడం.
  • పోలీస్, సైన్యం వంటి రంగాలలో వీరి శాతాన్ని పెంచడం అవకాశాలకు సంబంధించి ఉచిత - శిక్షణ ఇవ్వడం.
  • స్వశక్తి సముదాయాల ద్వారా ముస్లిం స్త్రీలకు పరపతి సౌకర్యాలు కల్పించడం.

(2) రంగనాథ్‌ మిశ్రా కమిటీ:
  • మైనారిటీల మత, భాషాపరమైన స్థితిగతులపై సిఫార్సులు చేయడం కోసం సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, జాతీయ మానవ వనరుల కమిషన్‌ మాజీ ఛైర్మన్‌ జస్టిస్‌ రంగనాథ్‌ మిశ్రా అధ్యక్షతన నలుగురు సభ్యులతో 2004 అక్టోబరు 29న ఒక కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ కమిషన్‌ దేశవ్యాప్తంగా పర్యటించి మైనారిటీ మతాల స్థితిగతులు, వారి వాస్తవ పరిస్థితిపై 2007 మే 21న కేంద్ర ప్రభుత్వానికి ఒక సమగ్ర నివేదికను సమర్పించింది.
సిఫారసు:
  • మైనార్టీలు విద్య , ఉద్యోగ రంగాలలో బాగా వెనుకబడి ఉన్నారు కాబట్టి విద్య , ఉద్యోగ అవకాశాలలో 15 % రిజర్వేషన్ ఇవ్వమని సిఫారసు చేసింది. ఈ రిజర్వేషన్ SC, ST కోటా 7 %,  OBC కోటాలో 8 % కోత విధించి అమలు చేయమని సిఫారసు చేసింది.

మైనారిటీల సంక్షేమ పథకాలు:
  • మైనారిటీల సంక్షేమానికి మన్ మోహన్ సింగ్ ప్రభుత్వం 2006లో ప్రధానమంత్రి 15 పాయింట్ల కార్యక్రమం (15 point Programme for minorities) ప్రవేశపెట్టింది.
  • UPSC, SPSC, SSC లాంటి పరీక్షల శిక్షణకు నై ఉడాన్‌ (Nai Udaan) పథకం
  • అల్ప సంఖ్యాక మహిళల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించడానికి నై రోష్ని (Nai Roshni) పథకం
  • మైనార్టీ యువతలో నైపుణ్యాల అభివృద్ధి కోసం సీఖో ఔర్‌ కమావో (Seekho aur Kamao (Learn & Earn) పథకం
  • మైనార్టీల సంప్రదాయక వృత్తుల పరిరక్షణ, శిక్షణ, అభివృద్ధికి ఉస్తాద్‌ పథకం
  • భారతీయ సంస్థల్లో భాగంగా గొప్ప వారసత్వం కలిగిన మైనారిటీల సంస్కృతి పరిరక్షణకు హమారీ థరోహర్‌ (Hamari Dharohar) పథకం.

వీటిని కూడా చూడండీ: